మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరి దీనితో అభిమానులు ఎంతో నిరాశకు గురి కాగా ఇప్పుడు చిరు తన హోమ్ క్వారంటైన్ లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ హోమ్ క్వారంటైన్ లో ఉండగానే తన మాతృమూర్తి శ్రీ అంజనా దేవి గారి జన్మదినం ఈరోజు జనవరి 29న కాగా చిరు తన సోషల్ మీడియా ద్వారా తన విషెష్ ని తెలియజేసారు. అయితే ఇది నిజంగా ఒక రకంగా భావోద్వేగ విషయం అని చెప్పాలి.
తాను “అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు” అంటూ అపురూపమైన విషెష్ ని తెలియజేసారు. అయితే ఈ క్వారంటైన్ టైం లో తాను నేరుగా కలిసి తన తల్లి ఆశీసులు తీసుకోకపోవడం కాస్త బాధాకరం అని చెప్పాలి. మరి చిరు అతి త్వరలోనే కోలుకోని తిరిగి రావాలని మనమంతా కోరుకుందాం..
అమ్మా !????????
జన్మదిన శుభాకాంక్షలు ????????క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ ????
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022