పాలిక్ దర్శకత్వంలో విజయ్, మధుప్రియ, ఆశ రాథోడ్, ప్రేమలను హీరో , హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ సాయి అమృత లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ప్రణవి ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ నరసింహా క్రియేషన్స్ సమర్పణలో తిరుపతి పటేల్, రామ్, భాను , నీలిమ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం మురికివాడ. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా లయన్ సాయి వెంకట్ కెమేరా స్విచాన్ చేశాను. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ…“మురికి వాడ నేపథ్యంలో జరిగే కథాంశమిది. ఇందులో ఫ్రెండ్ షిఫ్, ఎమోషన్స్ , సోషల్ మెసేజ్ తో పాటు అన్ని వర్గాలకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి… మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ…“ దర్శకుడు పాలిక్ గారు వెంచపల్లి సినిమా చేస్తున్న తీరు నచ్చి ఆయన దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాం. ఈ సినిమా ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తున్నాం. కథ, కథనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ అలరిస్తాయి“ అన్నారు.