పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా నాగ్

పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా నాగ్

Published on Jul 3, 2019 1:12 AM IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్. మన్మథుడులో ఉన్నట్టే మన్మథుడు2లో కూడా నాగార్జున పాత్ర ఫుల్ ఎంటెర్టైనింగా ఉంటుందట. అయితే మొదటి భాగంలో యాడ్ కంపెనీకి యజమానిగా కనిపించిన నాగ్ మన్మథుడు 2లో మాత్రం పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపిస్తారట. సినిమాలో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ హీరో పాత్రకి ఈ రకమైన నేపథ్యం ఎంచుకున్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంతలు కీలక పాత్రలు చేస్తున్నారు. ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదటి నుండి పాహితివి బజ్ కలిగి ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు