ఓటిటిలో “గుంటూరు కారం” రెస్పాన్స్ పై నాగవంశీ కామెంట్స్

ఓటిటిలో “గుంటూరు కారం” రెస్పాన్స్ పై నాగవంశీ కామెంట్స్

Published on Mar 26, 2024 6:12 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “గుంటూరు కారం” (Guntur Kaaram) కోసం తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లి ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

మరి రీజనల్ గా పలు ఆల్ టైం రికార్డ్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఈ అంతటినీ కూడా థియేటర్స్ లో గట్టి పోటీ మరియు డివైడ్ టాక్ తోనే సొంతం చేసుకుంది. అలాంటిది యూనానిమస్ గా పాజిటివ్ టాక్ కానీ పడి ఉంటే అది ఇంకో లెవెల్లో ఉండేది అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో రెస్పాన్స్ పక్కన పెడితే అంతకు మించిన సక్సెస్ గా ఓటిటిలో నిలిచింది అని చెప్పాలి.

దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని (Guntur Kaaram OTT) సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని అన్ని భాషల్లో అందుకుంది. అయితే ఈ ఓటిటి రెస్పాన్స్ పై డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. సినిమాపై లాజిక్ లు, అవన్నీ పక్కన పెడితే ఫ్యాన్స్ కి నచ్చేలా గుంటూరు కారం ఉందని కాన్ఫిడెంట్ గా చెప్పారు.

అంతే కాకుండా ఓటిటిలో వచ్చాక చాలా మంది సినిమా చాలా బావుందని చెప్పారని థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పటికీ ఓటిటిలో వచ్చిన తర్వాత రెండు టాక్ లలో వ్యత్యాసాన్ని గుర్తు చేసారు. వీటితో ససేమిరా మహేష్ బాబు లాంటి మాస్ హీరో ఎంతో అనుభవం ఉన్న త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నుంచి తాము ఖచ్చితంగా మంచి సినిమానే ఇచ్చామని తాను కుండ బద్దలు కొట్టినట్టుగా మరోసారి చెప్పారు దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు