చంద్రబాబు ఘటనపై నారా రోహిత్ ప్రెస్ నోట్ వైరల్.!

చంద్రబాబు ఘటనపై నారా రోహిత్ ప్రెస్ నోట్ వైరల్.!

Published on Nov 20, 2021 1:00 PM IST

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కి గురు చేసింది. ఏపీ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చెయ్యగా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు.

దీనితో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పుడు నారా టాలెంటడ్ వారి హీరో నారా రోహిత్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యగా అది వైరల్ అవుతుంది.

“ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుగారిని, వారి సతీమణి భువనేశ్వరిగారిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు విధానాలపై వుండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదు.

రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు గారి నైతిక సైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో వున్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి వుండడం వల్లే మీ మనుగడ సాగింది.

ఇప్పటికీ వాటికి కట్టుబడి వుండడం వల్లే సంయమనంతో వున్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసిపి దుశ్శాసనుల భరతం పడతారు.

ఈ వికృత క్రీడలను వెనకుండి ఆడిస్తున్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా వుండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయి లేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావటం దురదృష్టకరం పెదనాన్న, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే వుంటాం.” అని రోహిత్ తెలిపాడు. దీనితో ఈ ప్రెస్ నోట్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు