ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”

Published on Feb 2, 2024 8:04 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా కొత్త హీరోయిన్ శివాని నాగారం హీరోయిన్ గా పరిచయం అవుతూ దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”. మంచి ప్రమోషన్స్ నడుమ అంతకు మించిన ట్రైలర్ కట్ తో సాలిడ్ బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం అయితే నిన్న రాత్రి నుంచే పైడ్ ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యిపోయింది.

ఇక ఇక్కడ నుంచి మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి రాగా థియేటర్స్ అనంతరం ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకున్నారు. దీనితో థియేటర్స్ లో రన్ అనంతరం అందులో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా బన్నీ వాసు సమర్పణలో ఈ చిత్రం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు