ఫోటో మూమెంట్ : ప్రభాస్ పై దిశా తీసిన పిక్ వైరల్

ఫోటో మూమెంట్ : ప్రభాస్ పై దిశా తీసిన పిక్ వైరల్

Published on Mar 7, 2024 2:04 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అలాగే దిశా పటాని మరియు దీపికా పదుకోణ్ లు నటిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం తెలిసిందే. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ అవుతుంది. రీసెంట్ గానే ఇటలీకి చిత్ర యూనిట్ వెళ్లి ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు.

అయితే ఈ సాంగ్ షూట్ అయ్యాక రిటర్న్ జర్నీలో ప్రభాస్ పై హీరోయిన్ దిశా పటాని తీసిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇటు పక్క కూర్చుంటే అటు పక్క రో లో దిశా ప్రభాస్ ని తన ఫోన్ కెమెరాతో బంధించింది. మరి ఈ ఇద్దరిపై తీసిన పిక్ లో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీ స్మైల్ చూడవచ్చు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మే 9న ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు