ఫోటో మొమెంట్ : రాజమన్నార్ తో సలార్

ఫోటో మొమెంట్ : రాజమన్నార్ తో సలార్

Published on Jan 18, 2024 10:43 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా మూవీ యూనిట్ బెంగళూరులో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా మూవీలోని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై దీనిని విజయవంతం చేసారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభాస్ తో కలిసి దిగిన పిక్ ని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసారు జగపతి బాబు. సౌర్యంగుడిని కలిసిన రాజమన్నార్ అంటూ ఆయన పోస్ట్ చేసిన ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు