నేడు యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో బిగ్ డే వరల్డ్ కప్ క్రికెట్ లో సెమి ఫైనల్స్ అట్టహాసంగా వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. మరి ఈ వేదికలో మొత్తం ఇండియన్ సినిమా ప్రముఖులు కూడా హాజరు కాగా అందులో మన టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ కూడా వెళ్లారు. మరి వెంకీ మామ అయితే అక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ స్నాప్ ని అయితే షేర్ చేసుకోడం వైరల్ గా మారింది.
మరి తాను వెస్టిండీస్ క్రికెట్ కి చెందిన లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో అయితే కలిసి తాను సెల్ఫీ దిగి ఇండియా న్యూజిలాండ్ సెమి ఫైనల్ మ్యాచ్ లో ఈ లెజెండరీ క్రికెటర్ ని మీట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తాను షేర్ చేసుకున్నారు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వెంకీ మామ అయితే ఇప్పుడు దర్శకుడు శైలేష్ కొలనుతో ఓ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Delighted to be with the legendary Viv Richards at the #IndvsNZ Semi-final ????❤️ pic.twitter.com/6A5MvqRZrn
— Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2023