పృథ్వీరాజ్ “కడువ” రన్‌టైమ్ లాక్డ్!

పృథ్వీరాజ్ “కడువ” రన్‌టైమ్ లాక్డ్!

Published on Jul 6, 2022 12:00 PM IST


జన గణ మన తర్వాత స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కడువతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రం జులై 7, 2022 న ప్రధాన సౌత్ భాషల్లో మరియు హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా అఫీషియల్ రన్ టైం 2 గంటల 34 నిమిషాలు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయిక గా నటిస్తుంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు