‘రాక్షససుడు’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

‘రాక్షససుడు’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Aug 4, 2019 5:04 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “రాక్షససుడు” విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఉత్కంఠభరింతగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని ఏరియాల ఆడియన్స్ తో పాటు.. నైజాం జనాన్ని కూడా బాగానే ఆకట్టుకుంది. నైజాంలో కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లునే సాధించింది.

ఈ చిత్రం నైజాం ఏరియాలో శనివారం నాడు రూ .74 లక్షల షేర్ ను వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం రెండు రోజులకు గానూ నైజాం షేర్ రూ .1.37 కోట్లు సాధించింది. పైగా ఈ రోజు ఆదివారం నాడు ముందస్తు బుకింగ్‌ లు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక వారాంతపు రోజుల్లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం కలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ఫిలిం న్యూస్ మాధ్యమాలు ఈ చిత్రానికి మంచి రేటింగ్ ఇవ్వడంతో కలెక్షన్స్ కి అనుకూలించే అవకాశం ఎక్కువుగా ఉంది.

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల, వినోద్ సాగర్, నాన్ శరవణన్, రాధారవి ముఖ్యపాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు