‘బ్రూస్లీ’ పరాజయం తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘ధృవ’ను ఈమధ్యే సెట్స్పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఓ సరికొత్త లుక్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ తన ప్రతి సినిమాలోనూ ఫిజిక్ పరంగా స్ట్రాంగ్గా కనిపిస్తూనే, రకరకాల లుక్స్తో మెప్పించిన చరణ్, ‘ధృవ’లో ఓ పోలీసాఫీసర్ పాత్రలో మరింత కొత్తగా కనిపించనున్నారట.
ఇక ఇందుకోసం రామ్ చరణ్, ఓ ప్రఖ్యాత ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో వర్కవుట్స్ చేస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక డైట్ కూడా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. ‘ధృవ’ కోసం శాకాహారిగా మారిపోయిన విషయాన్ని చరణ్ తన ఫేస్బుక్ పేజీలో స్వయంగా ప్రకటిస్తూ ధృవలో కొత్తగా కనిపిస్తానని తెలిపారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.