రెండో ఘట్టంలో రానా సాయిపల్లవి!

రెండో ఘట్టంలో రానా సాయిపల్లవి!

Published on Jul 23, 2019 8:06 AM IST

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. కాగా ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు