రాశి ఖన్నాతో యాక్షన్ హీరో రెండోసారి !

రాశి ఖన్నాతో యాక్షన్ హీరో రెండోసారి !

Published on Dec 15, 2018 3:54 AM IST

‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్న గోపీచంద్.. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తిరు చెప్పిన స్టొరీ అద్భుతంగా ఉందని, తన తరువాత సినిమాని ఆ కథనే చెయ్యాలని గోపీచంద్ సంపత్ నంది సినిమాని కూడా పోస్ట్ ఫోన్ చేసి మరీ ఈ సినిమా చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన కథానాయకిగా రాశీ ఖన్నాను ఫైనల్ చేశారట. గతంలో రాశీ ‘జిల్’ సినిమాలో గోపీచంద్ సరసన నటించింది. ఇక తిరు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక దర్శకుడు సంపత్ నంది కూడా గోపీచంద్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా మొద్దలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు