‘అఖిల్’కి జోడిగా రష్మికా ఫిక్సేనా ?

‘అఖిల్’కి జోడిగా రష్మికా ఫిక్సేనా ?

Published on Jul 1, 2019 6:56 AM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ మొత్తం పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప. పైగా మొదటి షెడ్యూలు కూడా మొదలు అయి వారం రోజులు అవుతుంది. అయినా సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఆ మధ్య ఇద్దరు కొత్త హీరోయిన్స్ ను చూసారని.. వాళ్లల్లో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదట.

తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన దాదాపు రష్మికా మండన్ననే హీరోయిన్ గా ఫైనల్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికీ రష్మికా మండన్న వైపే మొగ్గు చూపారట. ఇక అఖిల్ కి ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కూడా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు