యాక్షన్ ఎలిమెంట్స్ తో విశాల్ “రత్నం” ట్రైలర్!

యాక్షన్ ఎలిమెంట్స్ తో విశాల్ “రత్నం” ట్రైలర్!

Published on Apr 15, 2024 5:39 PM IST

కోలీవుడ్ యాక్టర్ విశాల్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరి డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. ఏప్రిల్ 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ అంతా కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ప్రియా భవాని శంకర్ రోల్ సినిమాకి కీలకం అయినట్లు ట్రైలర్ ను చూసి చెప్పవచ్చు. సముద్రఖని, యోగిబాబు, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్‌లపై కార్తెకేన్ సంతానం మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు