ఇక నేను వెళ్లి హాయిగా నిద్రపోతానంటున్న సమంత

ఇక నేను వెళ్లి హాయిగా నిద్రపోతానంటున్న సమంత

Published on Jul 5, 2019 10:10 PM IST

సమంత నటించిన కొత్త చిత్రం ‘ఓ బేబీ’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి మార్కింగ్ షో నుండే సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. విమర్శకులు, ప్రేక్షకులు సినిమాలో సమంత నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కడా నెగెటివ్ టాక్ లేదు. ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వలన ఇన్నాళ్లు సమంతలో నెలకొన్న రిలీజ్ టెంక్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయింది.

ప్రేక్షకులు, విమర్శకుల స్పందన, మంచి ఓపెనింగ్స్ చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆమె అందరికీ కృతజ్ఞతలు తెలిపి ఇక వెళ్లి నిద్రపోతాను అంటూ ట్వీట్ చేశారు. దీన్నిబట్టి ఈ సినిమాపై ఆమె ఎంతలా నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు