ఈరోజు మొత్తం మన ఇండియన్ క్రికెట్ లవర్స్ ఒక బిగ్ డే. ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న టి 20 ఐపీఎల్ ఈరోజు గ్రాండ్ గా మొదలు కానుంది. అయితే మన దేశంలో కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇక్కడ అనుమతులు దొరక్కపోయే సరికి ఈసారి ఐపీఎల్ మ్యాచులు అన్ని అరబ్ కంట్రీస్ లో జరగనున్నాయి.
అలా ఈరోజు మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ రెండు డిగ్గి టీములు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్ మధ్య మొదలు కానుండడంతో మన దేశపు అగ్ర తారలు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మన టాలీవుడ్ కోలీవుడ్ సహా బాలీవుడ్ బడా స్టార్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
అలా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇరు జట్ల క్యాప్టెన్స్ మహేంద్ర సింగ్ ధోని మరియు రోహిత్ శర్మలకు సహా ఇతర జట్టు సభ్యులకు గుడ్ లక్ చెబుతూ ఆరడుగుల దూరం నుంచి హగ్ ఇస్తున్నానని ఇప్పుడున్న పరిస్థితులపై సెటైర్ వేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తానికి మాత్రం ఈరోజు మ్యాచ్ స్టార్టింగ్ మరియు దాదాపు 400 వందల రోజుల తర్వాత ధోని ఎంట్రీ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.
All the best to @ChennaiIPL & @mipaltan for today’s match. Wishing all the players to be healthy and have a good game. Do well @ImRo45 & @msdhoni Can’t wait to watch you boys! Big hug from 6 feet away.
— Shah Rukh Khan (@iamsrk) September 19, 2020