కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేసిన సెట్ కూడా పూర్తి అయింది. కాగా ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. సినిమా మొత్తంలో నాగ్ కామెడీనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.