‘బాహుబలి, బజరంగీ భాయ్జాన్’ చిత్రాలతో నేషనల్ స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గ్లోబెల్ టీచర్ 2020 అవార్డ్ గెలుచుకున్న టీచర్ రంజిత్ సిన్హ్ దిశాలె కథను కూడా తయారు చేస్తున్నానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 190 దేశాల్లో ఎవరు బెస్ట్ టీచర్ అని సర్వే చేస్తే.. అన్ని దేశాల నుండి మహారాష్ట్ర గవర్నమెంట్ టీచర్ రంజిత్ సిన్హ్ దిశాలె నెంబర్ వన్ స్థానంలో నిలిచి అవార్డు గెలుచుకున్నారు.
అందుకే విజయేంద్ర ప్రసాద్ ఈ టీచర్ బయోపిక్ రాస్తున్నాడట. అయితే, ఈ బయోపిక్ లో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు కథలను అందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు తలైవి సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.