టాక్ : ఉగాది నాడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ ?

టాక్ : ఉగాది నాడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ ?

Published on Mar 14, 2024 12:39 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, ఈశ్వరిరావు కీలక పాత్రలు చేయగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

ఇటీవల పలు భాషల్లో ఓటిటీ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న గుంటూరు కారం మూవీ ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా జెమినీ టివిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుందని, దీని పై త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. కాగా ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రమణగాడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విపరీతంగా ప్రసంశలు కురిసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు