లేటెస్ట్ : SSMB28 పై క్రేజీ బజ్ నిజమేనా ?

లేటెస్ట్ : SSMB28 పై క్రేజీ బజ్ నిజమేనా ?

Published on Nov 11, 2022 3:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ SSMB28 మూవీ ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుని త్వరలో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ జరుగనుండగా ఈ మూవీ కోసం పవర్ఫుల్ స్టోరీ, స్కిప్ట్ సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇక మహేష్ బాబు చాలా కాలం తరువాత పూర్తి స్థాయి ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ ఈ మూవీలో చేస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా మూవీ కి సంబంధించి షూటింగ్ వర్క్ పూర్తి కావడానికి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అవడానికి జూన్ నెలాఖరు వరకు సమయం పెట్టె చాన్సు ఉన్నందున యూనిట్ తమ మూవీని ఆగష్టు కి వాయిదా వేసినట్లు ఒక బజ్ ప్రచారంలో ఉంది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే అని, రాబోయే షెడ్యూల్ లో దాదాపుగా 40 రోజుల పాటు భారీ స్థాయిలో జరగనుండగా అనంతరం మిగతా బాలన్స్ షూట్ ని కూడా వేగవంతంగా పూర్తి చేసి పక్కాగా అనుకున్న తేదీకే SSMB28 మూవీ థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. దీనిని బట్టి ప్రస్తుతం ప్రచారం అవుతున్న బజ్ అంతా ప్రచారం మాత్రమే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు