ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు హర్రర్ మూవీ

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు హర్రర్ మూవీ

Published on Apr 5, 2024 3:01 AM IST

యువ నటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ మూవీ తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన ఈ మూవీలో ధనుష్ రఘుముద్రి కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది.

టెంపర్ వంశీ, సలోని, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని నరేష్ బాబు పి మరియు రవి చైతన్య కలిసి ఫస్ట్ కాపీ మూవీస్, బీ ది వే ఫిలిమ్స్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మించారు.

విషయం ఏమిటంటే, నేటి నుండి ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ నుండి ఎంత మేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు