“పుష్ప” షూట్ పై రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయ్.!

“పుష్ప” షూట్ పై రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయ్.!

Published on Dec 4, 2020 12:01 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” చిత్రం తెరకెక్కుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గాను భారీ అంచనాలు కూడా నెలకున్న సంగతి తెలిసిందే.

అయితే చాలా అడ్డంకులు అనంతరం లేటెస్ట్ గా షూట్ ను మొదలు పెట్టారు. సరైన యాక్షన్ సీక్వెన్స్ సీక్వెన్స్ లతోనే స్టార్ట్ అయ్యింది కానీ మళ్ళీ గ్యాప్ లోనే చిత్ర యూనిట్ కు కరోనా సెగ తగిలింది అని వార్తలు షాకిచ్చాయి. అయితే ఇక్కడే రెండు వెర్షన్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఒకటి మేకర్స్ కరోనా వల్ల షూట్ ను ఆపేసారు మరొకటి ఇంకా చిత్ర యూనిట్ షూట్ ను కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం అయితే పుష్ప షూట్ రాజమండ్రి, రంపచోడవరం ప్రాంత అడవుల్లో జరుగుతుందని అంతర్గత సమాచారం. మరి ఈ రెండిట్లో ఏది నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు