ఊహాగానాలకు చెక్, ఆగస్టు 15న యుద్ధం ఖాయమే

ఊహాగానాలకు చెక్, ఆగస్టు 15న యుద్ధం ఖాయమే

Published on Jul 5, 2019 11:45 AM IST

బాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమైయ్యాయి. ప్రభాస్ “సాహో” అక్షయ్ కుమార్ “మిషన్ మంగళ్” లతో పాటు జాన్ అబ్రహం నటించిన “బాట్లా హౌస్”, మూడు చిత్రాలు ఆగష్టు 15న విడుదల కానున్నట్లు ప్రకటించాయి. గతంలోనే ఈ విషయంపై చర్చ జరిగినప్పటికీ, సాహో తో పోటీపడటం ఇష్టం లేక మిగతా రెండు సినిమాల విడుదల తేదీలు మార్చారని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. “మిషన్ మంగళ్” మూవీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా నిర్వహించిన మంగళ్యాన్ ఉపగ్రహం నేపథ్యంలో తెరకెక్కుతుండగా, “బాట్లా హౌస్” గతంలో ఢిల్లీలో ఉగ్రవాదులపై జరిగిన దాడి సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.

ప్రభాస్ “సాహో” మాత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూడు చిత్రాలలో ఏది మంచి టాక్ తెచ్చుకున్నా అది మిగతా సినిమాల వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ మూడు చిత్రాలు ఆగస్టు 15నే విడుదల కు సిద్ధమైయ్యాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ రేస్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు