ఓటిటిలో “అనిమల్” రిలీజ్ పై ట్విస్ట్..

ఓటిటిలో “అనిమల్” రిలీజ్ పై ట్విస్ట్..

Published on Jan 16, 2024 9:20 AM IST


బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అనిమల్”. మరి గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని రణబీర్ సహా సందీప్ కెరీర్ లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కి దగ్గరకి వస్తుంది.

ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ తీసుకోగా ఇందులో ఈ చిత్రం జనవరి 26న వస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఈ రిలీజ్ ఆపాలి అంటూ ఈ సినిమా నిర్మాణ సంస్థ సినీ 1 స్టూడియోస్ వారు కేసు వేసిన విషయం వైరల్ గా మారింది. అనిమల్ సినిమా నిర్మాణంలో తాము ఒక భాగం కానీ తమకి ప్రాఫిట్స్ పంచడంలో కానీ మరికొన్ని పనులు మాకు చెప్పకుండానే టి సిరీస్ వారు చేసారని అందుకే అనిమల్ ఓటిటి రిలీజ్ ఆపాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

కానీ టి సిరీస్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ సినిమా హక్కులని సినీ 1 వారు టి సిరీస్ కి 2.2 కోట్లకు వదులుకున్నారన్న విషయాన్ని దాచి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయని అడుగుతున్నారని ఈ సినిమాకి వారికి సంబంధం లేదని సూచించారని తెలుస్తుంది. దీనితో ఢిల్లి హై కోర్ట్ వారు క్లారిటీ ఇవ్వాలని సినీ 1 సంస్థకి సూచించి ఈ కేసుని జనవరి 18కి వాయిదా వేసారట. దీనితో ప్రస్తుతానికి అనిమల్ ఓటిటి రిలీజ్ వాయిదా పడినట్టే అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు