డైరెక్టర్ వంశీ రాబోవు సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమాకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. ఇది అయన 25వ సినిమా. కె.వి ఆనంద్ ‘రంగం’, ‘రచ్చ’ సినిమాలలో నటించిన అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నికిత నారాయణ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమెకి వంశీతో మొదటి సినిమా ఇది. ”ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాతో కెరీర్ ప్రారంబించిన నికిత లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల వంటి సినిమాలను తీసిన ప్రముఖ డైరక్టర్ వంశీతో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ‘మొదటి రోజు షూటింగ్ ని ప్రముఖ డైరెక్టర్ వంశీ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా నా కెరీర్లో ఒక మైలు రాయి నిలిచి పోతుంది , నేను ఇంత తొందరగా ఇలాంటి గొప్ప డైరెక్టర్ తో చేస్తానని అనుకోలేదని’ నికిత చెప్పింది. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్
- గ్లామరస్ కలెక్షన్ : స్టన్నింగ్ శ్రద్ధా దాస్
- సలార్: ప్రశాంత్ చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది – పృథ్వీరాజ్ సుకుమారన్
- ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఎండ్ కానున్న “బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్”
- ఫోటోలు: ఈషా గుప్తా
- కొత్త ఫోటోలు : ఆశు రెడ్డి
- గ్లామరస్ ఫిక్స్ : అనన్య పాండే