శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగులో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్నాడు చియాన్ విక్రమ్. కాగా తాజాగా విక్రమ్ హీరోగా అక్షరహసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో తమిళంలో రాబోతున్న చిత్రం ‘కదరమ్ కొండన్’. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణ లో పారిజాత మూవీ క్రియెషన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్ ని అందించే విధంగా దర్శకుడు తెరకెక్కించాడట. ఈ చిత్రానికి తెలుగులో మిస్టర్ కెకె అనే టైటిల్ ని ఎనౌన్స్ చేయగానే సోషల్ మీడియా నుండి సామాన్య ప్రేక్షకుడి వరకూ హ్యూజ్ రెస్పాన్స్ రావటంతో ట్రేడ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ రోజు మిస్టర్ కెకె ట్రైలర్ ని విడుదల చేశారు. కమల్ హసన్ తమిళ ట్రైలర్ ని విడుదల చేయగా, అక్షర హసన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులైలోనే విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.