‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది.
కాగా తాజాగా ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో ప్రారంభమైన ఈ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో టబు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.