బుల్లితెర పై రెండోసారి “వాల్తేరు వీరయ్య” కి రెస్పాన్స్ ఇదే!

బుల్లితెర పై రెండోసారి “వాల్తేరు వీరయ్య” కి రెస్పాన్స్ ఇదే!

Published on Jan 6, 2024 12:47 AM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో, శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. రీసెంట్ గా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం 7.37 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు