మరోసారి ఆకట్టుకోబోతున్న ‘వెంకటలక్ష్మి’ !

మరోసారి ఆకట్టుకోబోతున్న ‘వెంకటలక్ష్మి’ !

Published on Feb 18, 2019 3:18 PM IST

నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల అవ్వనుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల అయి.. భాగానే ఆకట్టుకుంది. టీజర్ లో రాయ్ లక్ష్మీ తన అందంతో కట్టిపడేసింది. ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్స్ తో.. చక్కని అభినయం ఉన్న కళ్ళతో.. మరియు అందమైన రూపంతో నెటిజన్లను రాయ్ లక్ష్మీ బాగానే మెప్పించింది. మరి ట్రైలర్ తో కూడా అలాగే ఆకట్టుకుంటుందేమో చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, మహాత్ మరియు పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని హాస్యం ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు