మరో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అవుతుందా ?

మరో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అవుతుందా ?

Published on Jul 4, 2019 12:23 AM IST

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. ఆ స్థాయి హిటూ అందుకోలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’ సినిమా చేస్తున్నాడట. కాగా ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం.

ముఖ్యంగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి సందీప్ కిషన్ ఈ ‘తెనాలి రామకృష్ణ’ మరో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అవుతుందా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు