‘ఛలో’ లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ లో ప్రమాదానికి గురైన శౌర్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో శౌర్య కాలికి బలమైన గాయం కావడం వలన వైద్యులు నెల రోజుల పూర్తి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ శౌర్య మాత్రం మరో రెండు వారాల్లో షూట్ కి రెడీ అంటున్నాడట. ఈ నెల మూడో వారం నుండి ఆగిపోయిన రెండవ షెడ్యూల్ ను వైజాగ్ లో షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహరిన్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల అలరించబోతుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ, ప్రొడ్యూసర్ ఉషా ముల్పూరి,