మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్లు ఈ సినిమాకు రచయితలుగా పనిచేస్తున్నారు. డీవీవీ దానయ్య చాలా రిచ్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఇటలీలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ల మధ్య తీసిన మొదటి పాట షూటింగ్ నిన్నే ముగిసింది.
రెండో పాట షూటింగ్ కోసం సినిమా యూనిట్ స్పెయిన్కు షిఫ్ట్ అయింది. రామ్ చరణ్ సినిమాకు పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని, టీమ్ నుంచి మంచి సపోర్ట్ ఉందని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్గా కనిపిస్తాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.