హాట్ టాపిక్ గా మారిన ధరమ్ తేజ్ – రకుల్ ప్రీత్ ల జంట !

హాట్ టాపిక్ గా మారిన ధరమ్ తేజ్ – రకుల్ ప్రీత్ ల జంట !

Published on Nov 27, 2016 12:40 AM IST

winner
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ల జంట ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ‘విన్నర్’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ లపై రెండు పాటలను షూట్ చేశారు. ఈ పాటలకు సంబందించిన కొన్ని స్టిల్స్ తాజాగా విడుదలయ్యాయి. ఆ స్టిల్స్ చూసిన జనాలంతా ధరమ్ తేజ్, రకుల్ ల జంట చాలా బాగుందని అంటున్నారు.

ధరమ్ తేజ్ పక్కన రెజినా తరువాత అంత ఖచ్చితంగా కుదిరిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగే అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. స్వతహాగానే అందరి హీరో హీరోయిన్ల కన్నా ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ లు కాస్త ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. లాంటి వారిద్దరూ జతకట్టడంతో వీరి జంట ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుందని, సినిమాలో వీరి మధ్య రొమాన్స్ చాలా బాగా కుదిరి ఉంటుందని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా డ్యాన్సుల విషయానికొస్తే ఇద్దరూ మంచి డ్యాన్సర్లే కనుక పాటలు అదిరిపోతాయనే టాక్ కూడా ఉంది. నల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధులు నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు