ధృవ ప్రమోషన్ల కోసం క్రియేటివ్ గా ఆలోచిస్తున్న ‘గీతా ఆర్ట్స్’

ధృవ ప్రమోషన్ల కోసం క్రియేటివ్ గా ఆలోచిస్తున్న ‘గీతా ఆర్ట్స్’

Published on Aug 25, 2016 2:42 PM IST

geetha-arts
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్థాయికి తగ్గట్టు హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈ విషయంలో మెగా అభిమానులంతా బాగా నిరుత్సాపడ్డారు. దీంతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ తమిళ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ ను ‘రేసు గుర్రం’ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్లో ఉంది.

దీంతో నిర్మాణ సంస్థ అయిన ‘గీతా ఆర్ట్స్’ చిత్రం ప్రమోషన్లు మొదలుపెట్టే పనిలో పడింది. ఈ ప్రమోషన్లు చాలా ప్రత్యేకంగా ఉండాలని, వీటితో సినిమాపై జనాల్లో ఆసక్తి మరింత పెరిగాలని అల్లు అరవింద్ క్రియేటివ్ గా ఆలోచిస్తూ కొత్త ప్లాన్లు వేస్తున్నారట. ఇవి చాలా వైవిధ్యంగా ఉంటాయని, సినిమా ప్రచారంలో కొత్తధనాన్ని చూపుతాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి అరవింద్ వేస్తున్న ఆ ప్లాన్స్ ఏమిటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే మరి. ఇకపోతే ఈ చిత్రంలో అరవింద స్వామి నెగెటివ్ పాత్ర పోషిస్తుండగా రకుల్ ప్రీత్ చరణ్ జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు