చెన్నైలో ‘జనతా గ్యారెజ్’ కొత్త షెడ్యూల్

చెన్నైలో ‘జనతా గ్యారెజ్’ కొత్త షెడ్యూల్

Published on May 26, 2016 10:34 AM IST

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారెజ్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో మొదట్నుంచీ ఓ ప్రత్యేకత సంపాదించుకుంటూ వస్తోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‍లుక్ ఈమధ్యే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ లుక్‌కు అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఇక కొద్దిరోజుల క్రితం వరకూ హైద్రాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రేపట్నుంచి చెన్నైలో ఓ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది.

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటుండగా ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు. కొరటాల శివ స్టైల్లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చెన్నై షెడ్యూల్ తర్వాత మళ్ళీ హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాట చిత్రీకరణ జరగనుంది. జూన్ నెలాఖరు కల్లా టాకీపార్ట్ మొత్తం పూర్తి చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న సినిమా ఆగష్టు 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు