‘ప్రేమాభిషేకం’ తర్వాత ‘శతమానంభవతి’ కే ఆ క్రెడిట్ !

‘ప్రేమాభిషేకం’ తర్వాత ‘శతమానంభవతి’ కే ఆ క్రెడిట్ !

Published on Jan 20, 2017 4:20 PM IST

jayasudha
తెలుగు చలన చిత్రం రంగంలో ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని ఎంచుకుంటే అందులో ‘ప్రేమాభిషేకం’ తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రం 1981లో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేగాక అందులో ప్రధాన పాత్రలు ధరించిన అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, శ్రీదేవి లకు లైఫ్ టైమ్ ఫేమ్ ను అందించింది. అంతటి గొప్ప చిత్రం తర్వాత నటిగా తనకు ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ‘శతమానంభవతి’ చిత్రమేనని సహజనటి జయసుధ ఆనందంగా వెల్లడించారు.

సినిమా కథలో ప్రకాష్ రాజ్ భార్యగా ఒక ప్రధాన పాత్ర పోషించిన జయసుధ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసి సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం అందరికీ చేరేలా చేశారు. కుటుంబ విలువలు, బంధాలు ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరినీ అమితంగా ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో పెట్టుబడిని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లను లాభాల దిశగా నడిపిస్తోంది. నూతన దర్శకుడు సతీష్ వేగశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు