‘మేముసైతం’కి హాజరవుతున్న కమల్ హాసన్

‘మేముసైతం’కి హాజరవుతున్న కమల్ హాసన్

Published on Nov 24, 2014 8:24 AM IST

kamal-hasan-mimu-saitam1
టాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అంతా ఒక్కటై హుదూద్ బాధితుల కోసం చేయనున్న కార్యక్రమం ‘మేము సైతం’. ‘వుయ్ లవ్ వైజాగ్’ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుక నవంబర్ 30న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఈ వేడుకకి ఒక్క తెలుగు హీరోలే కాకుండా తమిళ హీరోలు కూడా హాజరు కానున్నారని ఇది వరకే తెలియజేశాం.

ఇటీవలే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి సూపర్ స్టార్ కమల్ హాసన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, విజయ్, సూర్య, విక్రం, విశాల్, కార్తీ, ఎఆర్ రెహమాన్, శంకర్ లను ఆహ్వానించారు. అందులో సూర్య, కార్తీ అప్పుడే మేము వచ్చి ఈ మేము సైతం కార్యక్రమంలో పాల్గొంటామని మాటిచ్చారు. తాజాగా వీరి లిస్టులో కమల్ హాసన్ కూడా వచ్చి చేరారు. ఆయన తన షెడ్యూల్స్ అన్నిటినీ ఫైనలైజ్ చేసి మేము సైతంకి హాజరు కానున్నట్లు తెలియజేశారు. వీరు కాకుండా రజినీకాంత్, విజయ్, విక్రమ్, ఎఆర్ రెహమాన్ లాంటి వారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

సుమారు 13 గంటల పాటు జరగనున్న ఈ లైవ్ టెలీథాన్ ఈవెంట్ కి తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాని హుదూద్ బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు