ఎంక్యూబ్ ఏషియన్ సినిమాస్ ని ప్రారంభించనున్న మహేష్ బాబు

ఎంక్యూబ్ ఏషియన్ సినిమాస్ ని ప్రారంభించనున్న మహేష్ బాబు

Published on Sep 16, 2014 9:28 AM IST

Mahesh_babu1

ప్రస్తుతం మన రెండు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో మల్టీ ప్లెక్సుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రెండునెలలకి ఓ మల్టీ ప్లెక్స్ ప్రారంభమవుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఎంక్యూబ్ ఏషియన్ సినిమాస్ మల్టీ ప్లెక్స్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్దమైంది. అత్తాపూర్ లోని ఈ మల్టీ ప్లెక్స్ సెప్టెంబర్ 19వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాతో ప్రారంభం కానుంది.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ఎంక్యూబ్ ఏషియన్ సినిమాస్ ని ప్రారంభించనున్నారు. అదే రోజున మహేష్ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన తమన్నా జోడీ కట్టింది.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్న ఈ మూవీకి సెన్సారు వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు