‘టెంపర్’ ఆడియో వేదిక వద్ద అభిమానుల కోలాహలం

‘టెంపర్’ ఆడియో వేదిక వద్ద అభిమానుల కోలాహలం

Published on Jan 28, 2015 5:42 PM IST

Temper2

నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో మరికొద్ది సమయంలో విడుదల కానుంది. శిల్పకళా వేదికలో ఈ ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం ప్రారంభానికి ముందే భారి ఎత్తున అభిమానులు శిల్పకళా వేదికకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంగణం అంతా సందడిగా, కోలాహలంగా మారింది.

‘టెంపర్’ ట్రైలర్లు, స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ మాస్ స్టిల్స్, కాజల్ అగర్వాల్ గ్లామర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి ఓ కారణం. తమ అభిమాన తారలను చూడడం కోసం అభిమానులు సుదీర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సౌత్ ఇండియా నెంబర్ వన్ ఈవెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా వారు ఈ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రేయాస్ మీడియా చేస్తున్న 400వ ఈవెంట్ కావడం విశేషం. ‘టెంపర్’ ఆడియో విడుదల కార్యక్రమం లైవ్ కవరేజ్ ను మల్లెమాల టీవీ యుట్యూబ్ ఛానల్లో వీక్షించండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు