వర్మ కోసం నాగార్జున, అమితాబ్ !

వర్మ కోసం నాగార్జున, అమితాబ్ !

Published on Dec 9, 2016 3:32 AM IST

amithab-and-nag
ఇటీవల హాట్ టాపిక్ గా మారిన రామ్ గోపాల్ వర్మ చిత్రం ‘వంగవీటి’ డిసెంబర్ 23న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రోజున విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు వంగవీటి రంగ వర్గీయులు మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. కొద్దిసేపట్లోనే ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి ఎలాగో వర్మ విజయవాడలో ఆడియో వేడుక పూర్తి చేశాక అంతా సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు వర్మ హైదరాబాద్ లో ‘శివ టు వంగవీటి’ అనే ఈవెంట్ ను జరపాలని నిర్ణయించాడు.

ఈ కార్యక్రమానికి ట్యాగ్ లైన్ గా జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఫ్రమ్ విజయవాడ టు నాగార్జున టు అమితాబ్ అని పెట్టాడు. అంటే తన కాలేజ్ జీవితం నుండి మొదటి సినిమా, ప్రస్తుతం అమితాబ్ తో చేస్తున్న సర్కార్3 వరకూ జరిగిన జర్నీ అన్నమాట. ఈ కార్యక్రమం డిసెంబర్ 20న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకకు వర్మకు అత్యంత ఆప్తులైన నాగార్జున, అమితాబ్ బచ్చన్ లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు