‘విజేత’ లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా మరో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఎం కుమారస్వామి నాయుడు దర్శకుడిగా, కథ కంచికి మనం ఇంటికి లాంటి కమర్షియల్ చిత్రాన్ని నిర్మించిన ఎం పి ఆర్ట్స్ బ్యానర్పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా, దత్తి సురేష్ బాబు క్రియేటివ్ ప్రోడ్యూసర్గా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు కూకట్పల్లి తులసివనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమాకు వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలియచేయనుంది.
యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్న కళ్యాణ్ దేవ్..!
యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్న కళ్యాణ్ దేవ్..!
Published on Sep 2, 2021 8:54 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- గ్లామరస్ కలెక్షన్ : సెన్సేషనల్ సమంత
- షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఎన్టీఆర్ స్టైలిష్ ఫైట్సే మెయిన్ హైలైట్
- ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?
- కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..
- ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?