కమెడియన్ స్థాయి నుండి ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అగ్ర నిర్మాతల జాబితాలో చేరిపోయాడు. ఈ సినిమా విజయం తరువాత నుండి ఆయనకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బాద్షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఐటీ దాడుల తరువాత ఆయన తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా పోస్ట్ చేసారు. తను కష్టపడి పైకి వచ్చానని, కష్టపడి పైకి వచ్చిన వాడిని లోకం నమ్మదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను ఎవరికీ బినామీ కాదు. నాకు ఆ అవసరం లేదు. నేను రాజకీయాల్లో లేను, మీ రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయొద్దు అంటున్న అగ్ర నిర్మాత
రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయొద్దు అంటున్న అగ్ర నిర్మాత
Published on Feb 13, 2013 4:11 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- ఫోటోలు: మీనాక్షి చౌదరి
- ఫోటోలు : చైత్ర జె ఆచార్
- “స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్
- పోల్ : “కల్కి 2898 ఎడి”, “పుష్ప 2” లలో ఏది అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంటుంది?
- గ్లామరస్ కలెక్షన్ : స్టన్నింగ్ శ్రద్ధా దాస్
- కలెక్షన్ : పూజా హెగ్డే