దళపతి స్వాగ్ తో “వరిసు” రిలీజ్ పై క్లారిటీ.!

దళపతి స్వాగ్ తో “వరిసు” రిలీజ్ పై క్లారిటీ.!

Published on Oct 24, 2022 10:55 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి సాలిడ్ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ని తెలుగు లో అయితే “వారసుడు” గా మేకర్స్ రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు దీపావళి కానుకగా అయితే మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ విజయ్ నుంచి రిలీజ్ చేసారు. ఇక ఈ పోస్టర్ అయితే విజయ్ ఫ్యాన్స్ కి ఈ దీపావళికి కూడా మంచి ట్రీట్ లా ఉందని చెప్పాలి.

విజయ్ పై ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. అంతే కాకుండా విజయ్ స్వాగ్ అయితే ఈ పోస్టర్ లో హైలైట్ అని చెప్పాలి. దీనితో ఈ కొత్త పోస్టర్ చూసి అయితే అభిమానులు మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం రిలీజ్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే దిగుతున్నట్టుగా క్లారిటీ ఇచ్చేసారు. మరి ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు