2.0 అక్కడ 2డి లో కంటే 3డి లోనే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కానుంది !

2.0 అక్కడ 2డి లో కంటే 3డి లోనే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కానుంది !

Published on Nov 28, 2018 10:19 AM IST

మచ్ అవైటెడ్ మూవీ ‘2.0’ విడుదలకు సిద్ధమైంది. రేపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. దాంతో హైదరాబాద్ , బెంగుళూరు , చెన్నై ల్లో ఈచిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. తమిళ్ తో పాటు తెలుగు , హిందీ లోనూ విడుదలవుతున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈచిత్రం తమిళంలో 2డి కంటే ఎక్కువ స్క్రీన్లలలో 3డి లో విడుదలకానుంది. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ , బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ . అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రానికి ఎ ఆర్ రహెమాన్ సంగీతం అందించారు. ఇక ఈచిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్ ను రాబట్టి ‘బాహుబలి’ రికార్డ్స్ ను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు