పూజా కార్యక్రమాలతో ఆర్ట్ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం!

పూజా కార్యక్రమాలతో ఆర్ట్ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం!

Published on Apr 30, 2024 8:42 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ గారు, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో పురాణపండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, సినీ రంగంలోకి వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారని, ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వృక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడదని అన్నారు.

ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ నితిన్ రెడ్డి చిమ్ముల, ఎడిటింగ్ అఖిల్ దేశ్పాండే, సంభాషణలు, పాటలు జక్క రాజశేఖర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ మక్కెన విజయ్, పీఆర్వో సాయి సతీష్ (SR PROMOTIONS) లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు