బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘గల్లీబాయ్’ నిన్న 3350 స్క్రీన్ లలో భారీ స్థాయిలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో మొదటి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. నిన్న సెలవు దినం కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈచిత్రం 18.70 కోట్లను రాబట్టిందని సమాచారం.
మ్యూజికల్ డ్రామా నేపథ్యంలో జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కు జోడిగా అలియా బట్ నటించింది. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు. ఇక ఇటీవల ‘సింబా’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న రణ్వీర్ తాజాగా ఈ గల్లీ బాయ్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.