“గుంటూరు కారం” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

“గుంటూరు కారం” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 17, 2024 10:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas) దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం (Gunturu kaaram). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 9, 2024 న ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో గుంటూరు కారం ప్రసారం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ను జెమిని టీవీ ఛానల్ రిలీజ్ చేయడం జరిగింది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెర పై గుంటూరు కారం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు