యువత జీవనశైలికి దగ్గరగా కొత్త చిత్రం !

యువత జీవనశైలికి దగ్గరగా కొత్త చిత్రం !

Published on Jul 23, 2019 8:36 PM IST

గతంలో నంది అవార్డు పొందిన చిత్రం ‘హితుడు’. 2015లో కె.ఎస్.వి. బేనర్ మీదుగా విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అందులో నక్సలైట్ గా జగపతిబాబు పాత్రను తీర్చిదిద్దిన విధానం, మలయాళీ నటి మీరనందన్ తన పాత్రలో ఒదిగిపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్ర దర్శకుడైన కె.విప్లవ్ ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకం పై ఓ సున్నితమైన ప్రేమకథాచిత్రంగా ఆయన దీనిని మలచనున్నారు. ప్రేమకు రెయిన్ చెక్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అభిలాష్, అరవింద సమేత, మిస్టర్ మజ్ను, వంటి చిత్రాల్లో నటించి, మెప్పించిన రాఘవ్ కథానాయకులుగా ఈ చిత్రానికి ఎంపికయ్యారు. ఈ తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుందని, ఆద్యంతం మనసును రంజింపజేసే సన్నివేశాలతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు కె.విప్లవ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్ట్ పనులు పూర్తికావచ్చాయని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సమర్పణ: కేఎస్వీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు